Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అభ్యర్థుల ఆందోళనతో సీబీఏస్ఈ స్పష్టీకరణ
హైదరాబాద్ : ఏంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నేషనల్ ఎలిజీబులిటీ అండ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) మరోసారి వివాదాల్లో చిక్కుకుంది. అయితే వీటిపై సీబీఎస్ఈ వెంటనే స్పందించి నీట్-2018 సిలబస్లో ఎలాంటి మార్పూలేదని వివరణ ఇచ్చింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వాస్తవానికి నీట్ ప్రశ్న ప్రతాల రూపకల్పన పూర్తిగా సీబీఎస్ఈ సిలబస్ ఆధారంగానే ఉండేది. దీనికి వివిధ రాష్ట్రాల బోర్డులు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఆపశ్న పత్రాలు సీబీఎస్ఈ సిలబస్లో చదివిన వారికే ఉపయోగకరంగా ఉంటాయని, రాష్ట్రల సిలబస్లో చదివిన వారికి కష్టతరమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నీట్ సిలబస్లో మార్పులు చేయాలని ఎంహెచ్ఆర్డీ ఇటీవల సీబీఎస్ఈ ని ఆదేశించింది. నీట్-2018 ప్రశ్నపత్ర రూపకల్పనలో సీబీఎస్ఈ సిలబస్ సహా రాష్ట్రాల ఇంటర్ బోర్డుల సిలబస్నూ పరిగణలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. దీంతో మళ్లీ అభ్యంతరాలు వచ్చాయి. ఇప్పుడు సిలబస్ మారిస్తే తీవ్రంగా నష్టపోతామని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం వెంటనే స్పందించి కేంద్రానికి ఫిర్యాదు చేశాయి. పరిస్థితిని గమనించిన సీబీఎస్ఈ శనివారం అత్యవసరంగా సమావేశమై నీట్-2018 పరీక్ష సిలబస్లో మార్పులు చేయడం లేదని ప్రకటించింది.