Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొండగట్టు నుంచి యాత్ర ప్రారంభం : పవన్
హైదరాబాద్ : జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ యాత్ర త్వరలో ప్రారంభం కానుంది. కరీంనగర్ జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం నుంచి తన యాత్రను ప్రారంభిం చనున్నట్టు ఆయన శనివారం ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. తాను గతంలో 2009 ఎన్నికల్లో ప్రచారం చేస్తుండగా పెను ప్రమాదం నుంచి తాను అక్కడే బయటపడ్డానని, తమ కుటుంబ ఇలవేల్పు ఆంజనేయస్వామి కావడంతో తన నిరంతర రాజకీయ యాత్రను కొండగట్టు నుంచే ప్రారంభించాలని నిర్ణయించినట్టు తెలిపారు. సర్వమత ప్రార్ధనల అనంతరం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల ఆశీస్సుల కోసం బయలుదేరనున్నట్లు పేర్కొన్నారు. మీ ముందుకు వస్తున్నానని తెలిపారు. పర్యటన ప్రణాళికను కొండగట్టులోనే ప్రకటిస్తానన్నారు. అయితే తేదీని ప్రకటించలేదు.
మార్చిలో ప్లీనరీ..?
మార్చి మొదటివారంలో లేదా రెండో వారంలో నిర్వహించే జనసేన పార్టీ ప్లీనరీ హైదరాబాద్లో నిర్వహించే అవకాశాలున్నాయని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ జనవరిలో మహిళలు, సీనియర్ సిటిజన్లతో ముందుగా ఒక వర్క్షాప్ నిర్వహిస్తామని గతంలోనే పవన్ ప్రకటించారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. దీంతో ఏకంగా మార్చిలో ప్లీనరీని నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నారు.