Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి : కలామ్ ఇన్నోవేషన్ గవర్నెన్స్ అవార్డు (కెేఐజీఏ -2018)ను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణా భివృద్ధి, ఐటి శాఖ మంత్రి నారా లోకేశ్ అందుకు న్నారు. డిల్లీలోని విజ్ఞాన్ భవన్లో శనివారం నిర్వహించిన ఈ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్ర మంలో రాజ్యసభ సెక్రటరీ జనరల్ దేశ్ దీపక్వర్మ లోకేశ్కు అవార్డు, జ్ఞాపికను అందజేశారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో టెక్నా లజీ అనుసంధానంతో గ్రామాల అభివృద్ధికి తీసు కుంటున్న చర్యలు, అధునాతన సాంకేతిక పరిజ్ఞా నంతో పంచాయతీరాజ్ శాఖ డ్యాష్ బోర్డు రూప కల్పనకు లోకేశ్కు ఈ అవార్డు లభించింది. అనం తరం డిల్లీలో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ను మంత్రి లోకేశ్ కలిశారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పథకం అనుసంధా నంతో గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమా లను వివరిస్తూ రూపొందించిన ప్రత్యేక పుస్తకాన్ని ఆయనకు అందజేశారు. మంత్రి వెంట ఏంపీలు సీిఎం రమేష్, కె.రామ్మోహన్ తదితరులున్నారు.