Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుప్రీంకోర్టు న్యాయమూర్తి లావు నాగేశ్వరరావు
విశాఖ : ప్రజల స్వేచ్ఛను, గోప్యతను హరించే హక్కు ఎవరికీ లేదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు అన్నారు. ఎయు న్యాయకళాశాల ఆధ్యర్యాన వైవీఎస్.మూర్తి ఆడిటోరియంలో శనివారంఆచార్య ఎస్.వెంకట రామన్ స్మారకోపన్యాసం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో 'డైనమిక్స్ ఆఫ్ లైఫ్, లిబర్టీ, ప్రైవసీ అండ్ లా' అనే అంశంపై లావు నాగేశ్వరరావు ప్రసంగించారు. ప్రజల జీవనాన్ని నడిపించేది రాజ్యాంగమేనని, ప్రజలు గౌరవంతో తమ జీవనాన్ని సాగించడం ప్రాథమిక హక్కు అని చెప్పారు. భారత్, ఇంగ్లాండ్, అమెరికా దేశాలలోని వివిధ తీర్పులను, ఉదంతాలను ఆయన ఈ సందర్భంగా ఉదహరించారు. కొన్ని తీర్పులు న్యాయశాస్త్రంపై విస్తృత అవగాహనను కల్పిస్తున్నాయని అన్నారు.