Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తాగునీటి కోసం వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్
- ఆదరణ-2కు ఆమోదం
- క్లౌడ్ హబ్ పాలసీకి గ్రీన్ సిగల్
- విద్యుత్ శాఖలో పలు పోస్టుల భర్తీ : మంత్రి మండలి నిర్ణయాలు
అమరావతి : ప్రభుత్వంలో ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులకు 50 శాతం జీతాలు పెంచుతూ మంత్రిమండలి నిర్ణయించింది. జీవో నెంబర్ 151 ద్వారా కవర్కానీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఈ నిర్ణయం వర్తించనుంది. వెనుకబడిన తరగతుల చేతి వృత్తుల వారికి మెరుగైన, ఆధునిక చేతి పనిముట్లు సరఫరా చేసేందుకు దోహదం చేసే ఆదరణ-2 పథకానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి అధ్యక్షతన సచివాలయంలో శనివారం భేటీ అయిన మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ఏప్రిల్ నుంచి ఈ పథకాన్ని ప్రారంభిస్తామని, ఈ పథకం వల్ల 2.5 లక్షల మంది లబ్ధి పొందుతారని తెలిపారు. రూ. 300 కోట్లు కేటాయించామన్నారు. ఈ పథకం క్రింద 3 స్లాబుల్లో రూ.30 వేలు, రూ.20 వేలు, రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తారు. 70 శాతం సబ్సిడీ, 20 శాతం ఎన్బీసీిఎఫ్డీసీి రుణం, 10 శాతం లబ్దిదారుల వాటా ఉంటుంది. ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు అందించే వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. 5 జిల్లాలకు రూ.9,400 కోట్లతో పీపీపీి పద్ధతిలో, మరో 8 జిల్లాలలో తాగునీటి ప్రాజెక్టులు చేపట్టేందుకు రూ.5,330 కోట్ల ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి నిధులు సేకరించనున్నారు. మొత్తం రూ.6,330 కోట్లు వ్యయం కానున్న ఈ ప్రాజెక్టుకు రూ. 1000 కోట్లు ప్రభుత్వం సమకూర్చనుంది. శ్రీకాకుళం జిల్లా భావనపాడు గ్రీన్ఫీల్డ్ నాన్ మేజర్ పోర్టును పబ్లిక్, ప్రయివేటు భాగస్వామ్యంలో ఏర్పాటు చేయడం కోసం అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ లిమిటెడ్ను డెవలపర్గా ఎంపిక చేస్తూ మంత్రిమండలి నిర్ణయించింది.
భోగాపురం గ్రీన్ఫీల్డు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేసేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. డైరెక్టర్ జనరల్, డ్రగ్స్ అండ్ కాపీరైట్స్, డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి ఒక సబ్ఇన్స్పెక్టర్ పోస్టు, జిల్లాకు రెండు పోస్టుల చొప్పున 26 కానిస్టేబుల్స్ పోస్టులను మంజూరు చేస్తూ మంత్రిమండలి నిర్ణయించింది. డిప్యుటేషన్ పద్ధతిలో వీటిని భర్తీచేస్తారు. ఆర్టిపీషీియల్ ఇంటలిజెన్స్ అండ్ క్లౌడ్ హబ్ పాలసీ 2018-2020కి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఉద్యోగాల కల్పన ఆధారంగా రాయితీ ఇస్తారు. పూర్తి స్థాయి మౌలిక వసతులను కల్పిస్తారు. అభివృద్ధి చేసిన భూమి, విద్యుత్, ఫైబర్ కనెక్షన్, నీరు అందించడంతో పాటు స్టేట్ జీఎస్టీలో 50 శాతం సబ్సిడీ ఉంటుంది.