Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విపత్తు నివారణ చట్టం అమల్లో విఫలమైనందుకు..
ముంబయి: విపత్తు నివారణ చట్టాన్ని ప్రభావవంతంగా అమలు చేయకపోవడంపై మహారాష్ట్ర ప్రభుత్వానికి బాంబే హైకోర్టు శనివారం అక్షింతలు వేసింది. విపత్తు నివారణ చట్టం ప్రకారం జిల్లా విపత్తు నివారణ సంస్థలను ఏర్పాటు చేయనందుకు హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. అన్ని జిల్లాల్లో విపత్తు నివారణ సంస్థలను ఈ నెల 31లోపు ఏర్పాటు చేయాలని న్యాయమూర్తులు ఎఎస్ ఓకా, ఎమ్ ఎస్ సోనక్లతో కూడిన ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. వర్షాల్లేక కరువు నెలకొన్న ప్రాంతాల్లో విపత్తు నివారణ చట్టం-2005ను అమలుచేసేలా ప్రభు త్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఓ స్వచ్ఛంద సంస్థ బాంబే హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. అలాగే ఆ చట్టం కరువును ఏ అంశాల ఆధారంగా గణిస్తుందో వివరించాలని ఆ పిటిషన్లో పేర్కొంది. ఈ చట్టం అమల్లోకి వచ్చి 12 ఏండ్లు గడుస్తున్నా ఇప్పటికి కనీ సం ముంబయి, దాని పరిసర జిల్లాల్లోనూ విపత్తు నివారణ సంస్థలను ప్రభుత్వం ఏర్పాటుచేయకపోవడం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.