Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమరజవాన్ల కుటుంబాలకు అండగా సేవాజల్
న్యూఢిల్లీ: దాహం వేసి రోడ్డుపై వెతుకుతాం.వాటర్ బాటిల్ కొంటే రూ.15 లేదా..అంతకంటే ఎక్కువగా అమ్ముతున్నాయి ప్రయివేట్ కంపెనీలు.ఇపుడు ఆరు రూపాయలకే వాటర్ బాటిల్ ఇస్తామంటున్నారు.అయితే ప్రయివేట్ సంస్థ కాదు.ఆర్మీ కుటుంబాలు.దేశాన్ని కాపాడే క్రమంలో ప్రాణాలను కోల్పోయిన అమర జవాన్ల కుటుంబాలకు అండగా ఉండేందుకు ఆర్మీ వైఫ్స్ వెల్ఫేర్ అసోసియేషన్(ఏడబ్ల్యూడబ్ల్యూఏ) వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 'సేనా జల్' పేరుతో వాటర్ బాటిల్స్ను రూ.6కే విక్రయించే కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని ద్వారా వచ్చిన నగదును అమరువీరుల కుటుంబాలు, వారి పిల్లల చదువుకు పోషణకు ఉపయోగించనున్నారు. భారతీయ ఆర్మీ కుటుంబాలు వీటిని తయారు చేస్తున్నాయి. ప్రస్తుత సైన్యాధిపతి జనరల్ బిపిన్ రావత్ సతీమణి మధులిక రావత్ ఈ అసోసియేషన్కు సారథ్యం వహిస్తున్నారు.