Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాల్దా కార్మికుడి అనుమానాస్పద మృతి
- సీబీఐ విచారణకు కుటుంబ సభ్యుల డిమాండ్
కోల్కతా : రాజస్తాన్లో మరో 'లవ్ జిహాద్' హత్య జరిగింది. మహమ్మద్ అఫ్రాజుల్ ఖాన్ను శంభులాల్ రేగర్ అనే హిందూత్వవాది దారుణంగా హత్య చేసిన సంఘటనను దేశం మరువక ముందే 'స్టాప్ లవ్జిహాద్' పేరుతో మరో వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఇద్దరు మృతులు కూడా పశ్చిమ బెంగాల్లోని మాల్దాకు చెందినవారే కావడం గమనార్హం. దీనిపై సీబీఐ విచారణ జరపాలని మృతుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. సీపీఐ(ఎం), కాంగ్రెస్ తదితర పార్టీలు కూడా ఈ సంఘటనల్లో సామీప్యం ఉందని ఆరోపిస్తున్నాయి. సంఘటన వివరాల్లోకి వెళితే మాల్దాలోని చంచోల్ పోలీస్స్టేషన్ పరిధిలోని స్వరూప్నగర్ గ్రామానికి చెందిన కార్మికుడు షకిర్ అలీ (38) రాజస్తాన్లోని జైపూర్లో అనుమాస్పదంగా మృతిచెందాడు. మృతదేహంపై గాయాలు గుర్తులు, యాసిడ్తో కాలిన గాయాలున్నాయి. కాగా దీనిని పోలీసులు ఆత్మహత్యగా చిత్రీకరిస్తుండగా, మృతుడి సోదరులు మాత్రం హత్య అంటున్నారు.