Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఎస్ ఉద్యోగుల మద్దతు ఎన్ఎంఓపీఎస్ ప్రధాన కార్యదర్శి స్థితప్రజ్ఞ
నవతెలంగాణ - బెంగుళూరు
పాత పింఛన్ ప్రకటించిన పార్టీలకే రాబోయే కాలంలో మద్దతు ఇస్తామని కాంట్రిబ్యూటరీ పింఛన్ స్కీం (సీపీఎస్) ఉద్యో గులు ప్రకటించారు. శనివారం కర్ణాటక రాజధాని బెంగుళూ రులోని ఫ్రీడం పార్క్లో 1.60 లక్షల సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులు లాంగ్ సత్యాగ్రహ నిరాహారదీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ మాట్లాడుతూ సీపీఎస్ రద్దయ్యే వరకు ఈ పోరాటంలో కలిసి పాల్గొంటామని అన్నారు. జనతాదళ్ సెక్యులర్ మ్యానిఫెస్టోలో ఈ అంశాన్ని పొందుపరుస్తామని హామీ ఇచ్చారు. నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పింఛన్ స్కీం (ఎన్ఎంఓపీఎస్) ప్రధాన కార్యదర్శి గంగాపురం స్థితప్రజ్ఞ మాట్లాడుతూ 29 రాష్ట్రాల్లో 56 లక్షల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కాంట్రిబ్యూటరీ పింఛన్ విధానంలో ఉన్నారని చెప్పారు. దీంతో సీపీఎస్ ఉద్యోగుల భవిష్యత్తు షేర్మార్కెట్పై ఆధారపడి ఉందన్నారు. దేశంలో దాదాపు 6,268 మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు ఒక్క రూపాయి పింఛన్ నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్ఎస్డీఎల్) నుంచి, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందలేదని ఆందోళన వ్యక్తం చేశారు.
సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి గోపాలకృష్ణ మాట్లాడుతూ పింఛన్ ఉద్యోగి ప్రాథమిక హక్కు అని అన్నారు. రాజ్యాంగంలో ఆర్టికల్ 16,14 ప్రకారం సమానత్వం అందరికీ వర్తిస్తుందని చెప్పారు. సీపీఎస్కు కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదని, ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సీపీఎస్ ఉద్యోగుల యూనియన్ కల్వల్ శ్రీకాంత్, కోశాధికారి నరేష్గౌడ్, నాయకులు శ్రీనివాస్, పవన్, కిరణ్, నర్సింహ, నాగన్న తదితరులు పాల్గొన్నారు.