Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 17 మంది మృతి..
- మూడు ఫ్యాక్టరీల్లో విస్తరించిన మంటలు
న్యూఢిల్లీ: ఢిల్లీలో మూడు ఫ్యాక్టరీ ల్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. శనివారం ఓ ఫ్యాక్టరీలో లేచిన మంటలు మూడు ఫ్యాక్టరీలకు అమాంతంగా విస్తరించాయి. ఈ ప్రమాదంలో 17 మంది కార్మికులు చనిపోయారు. పలు వురు క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు.స్థానికులకు ఇచ్చిన సమాచారం ప్రకారం..ఢిల్లీలోని బవానా ప్రాంతంలోని..ఓ ప్లాస్టిక్ గోదాంలో మంటలు చెలరేగాక..పక్కనే ఉన్న బాణాసంచా ఫ్యాక్టరీకి విస్తరించాయి.ఈ ప్రమాదం జరిగినప్పుడు 13 మంది కార్మికులు పై అంతస్థులో ఉన్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో ముగ్గురు,ఒకరు బేస్మెట్లో చనిపోయారు.ఈ మృతుల్లో ఎనిమిది మహిళా కార్మికులున్నారు.మంటల్లో చిక్కుకున్న వారు తమ ప్రాణాలు కాపాడుకోవటానికి పై అంతస్థునుంచి కిందకు దూకేశారు.విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. సుమారు పది అగ్నినిరోధక శకటాలతో మంటల్ని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు.ప్రమాద ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.