Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లక్నో : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆగ్రా నగరంలోని చారిత్రక కట్టడమైన తాజ్మహల్ను కెనడా ప్రధాని దంపతులు ఆదివారం సందర్శించారు. వారం రోజుల పర్యటన నిమిత్తం భారత్కు వచ్చిన జస్టిన్ ట్రూడో కుటుంబసమేతంగా తాజ్మహల్ను వీక్షించారు. ట్రూడో ఈనెల 25 వరకు భారత్లో పర్యటిస్తారు. ఈనెల 23న ప్రధాని మోడీతో సమావేశమవుతారు. ఈ సందర్భంగా ఇరు దేశల మధ్య ఉన్న వాణిజ్య, రక్షణ, పెట్టుబడులు, వాతావరణం వంటి అంశాలపై చర్చించనున్నట్టు సమాచారం. ఈ పర్యటనతో సివిల్ న్యూక్లియర్ రంగానికి సంబంధించి ఒప్పందాలు బలపడే అవకాశముందని భారత ప్రధాని కార్యాలయం పేర్కొన్నది. ట్రూడోతో పాటు కెనడా విదేశాంగ మంత్రి క్రిస్టియా ఫ్రీలాండ్, సైన్స్, ఆర్థిక శాఖ మంత్రి నవ్దీప్ బైన్స్, రక్షణ శాఖమంత్రి హర్జిత్ సింగ్ సజ్జన్, క్రీడా శాఖ మంత్రి క్రిస్టి డంకన్, నిర్మాణ రంగ శాఖ మంత్రి అమర్జీత్ జోషి తదితరులు భారత్ పర్యటనకు వచ్చారు. కెనడాలో 14లక్షల మంది ప్రవాస భారతీయులున్నారు.