Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుంటూరు జిల్లా వాసులుగా గుర్తింపు
నవతెలంగాణ-అడవిదేవులపల్లి
నల్లగొండ జిల్లా అడవిదేవు లపల్లి మండలకేంద్రంలో రెండు అస్థిపం జరాలు సోమవారం లభ్యమయ్యాయి. ఆ అస్థిపంజా లు గుంటూరు జిల్లా కు చెందిన ఓ మహిళ, పురుషుడివని పోలీసులు గుర్తించారు. హత్యా? ఆత్మహత్య చేసుకున్నారా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతు న్నారు. పోలీసుల వివరాల ప్రకారం..అడవిదేవులపల్లిలోని సత్రశాల సమీ పంలో గల చెట్ల పొదల్లో రెండు అస్థిపంజరాలు, చీర, ఇతర దుస్తులు, చెప్పులు, డ్రైవింగ్ లైసెన్స్, పురుగుల మందు డబ్బాలు కన్పించడంతో స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించారు. డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా గుంటూరు జిల్లాకు చెందిన వారిగా పోలీసులు నిర్ధారించారు. లైసెన్స్పై కోరె అప్పారావు, తండ్రి వెంకటేశ్వర్లు, గంగవరం గ్రామం, గురజాల మండలం, గుంటూరు జిల్లాగా ఉంది. ఆ అడ్రస్ ఆధారంగా గురజాల పోలీసులకు సమాచార మందించారు. గంగవరం గ్రామానికి చెందిన కోరె అప్పారావు(31), భార్య శ్రీలక్ష్మికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అప్పారావు గురజాలకు చెందిన మువ్వా కాసులు(32)తో రెండేండ్లు వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇద్దరూ ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. వారు కనిపించడం లేదని ఈ ఏడాది జనవరి ఒకటో తేదీన గురజాల పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. అదృశ్యమైన ఆ ఇద్దరే వీరై ఉంటారని అడ్రస్ ఆధారంగా పోలీసులు నిర్ధారించారు. కోరె అప్పారావు బంధువులు వెంకటేశ్వర్లు, ఎలమందలు ఘటనా స్థలానికి వచ్చి డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా గుర్తించారు. డీఎన్ఎ పరీక్షల నిమిత్తం ఆ రెండు అస్థిపంజరాల నుంచి కొన్ని భాగాలను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. డీఎస్పీ శ్రీనివాస్, సీఐ రమేశ్బాబు, అడవిదేవులపల్లి, వాడపల్లి ఎస్ఐలు శివకుమార్, రామన్గౌడ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తులో ఉంది.