Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఎన్ఆర్సీ'పై గడువు పెంపునకు నో..
న్యూఢిల్లీ : అసోంలో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్(ఎన్ఆర్సీ) జాబి తా విషయమై కేంద్రా నికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. రాష్ట్ర్రంలో పౌరుల నమోదుకు సంబంధించిన తుది జాబి తాను ప్రకటిం చేందుకు గడువు పొడిగించేది లేదం టూ భారత సర్వోన్నత న్యాయస్థానం మంగ ళవారం స్పష్టం చేసింది. మే 31లోగా ఎన్ఆర్సీ తుది జాబితా ప్రకటిం చాలని న్యాయ మూర్తులు రంజన్ గోగోరు, ఆర్ఎఫ్ నారీమన్ల నేతృత్వంలోని ధర్మాసనం తేల్చి చెప్పింది. అంతేకాక.. ఈ వ్యవహారాన్ని స్వయంగా పర్యవేక్షించనున్నట్టు ధర్మాసనం వెల్లడించింది. అయితే.. మే 31లోగా ఎన్ఆర్సీ జాబితా తయారీ భౌతికంగా సాధ్యం కాదని కేంద్రం తరఫు న్యాయవాది, అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ సుప్రీంకోర్టుకు విన్నవించారు. ఈ వాదనపై ధర్మాసనం అభ్యంతరం తెలిపింది.