Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామని మోడీ అన్నారు. మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన ఓ సమ్మేళనంలో మోడీ మాట్లాడుతూ..రైతుల ఆదాయాన్ని పెంచాలంటే కొన్ని చర్యలు అవసరమని,ఆ దిశగా ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు. ముఖ్యంగా పెట్టుబడి ఖర్చు తగ్గించటం,ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచటం,చేతికొచ్చిన పంట నష్టాల బారిన పడకుండా కాపాడటం వ్యవసాయరంగంలో కీలకమైనవని చెప్పారు. 25 ఏండ్లుగా సేద్యరంగానికి ఒక దశ,దిశలేకుండా పోయిందని, అందువల్లే తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టినట్టు తెలిపారు. సించారు యోజన కింద 99 ప్రాజెక్టులు చేపట్టామని,దీనికోసం కేంద్రం 80 వేలకోట్లు ఖర్చు చేస్తున్నదని వివరించారు. రైతు దేశానికి అన్నదాత అని, ఇప్పుడిప్పుడే సేద్యం తీరు మారుతున్నదని చెప్పారు. అయితే, రైతుస్థితి మాత్రం మారలేదన్నారు. వ్యవసాయ రంగం కోసం కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రధాని వివరించారు.