Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అన్నదాతల రుణాలపై ఒత్తిళ్ల.. మాల్యా,నీరవ్లకు పరారయ్యేలా తోడ్పాటు
- రిజర్వ్బ్యాంకు నిర్లక్ష్యంపై పిటిషనర్ ప్రస్తావన
- పీఎన్బీ స్కాంపై విచారణకు సుప్రీం అంగీకారం
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకు భారీ కుంభకోణంలో నిందితుడైన నీరవ్ మోడీని భారత్ రప్పించేందుకు కేంద్రానికి మార్గదర్శకాలు జారీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. నీరవ్ను రెండు నెలల్లోగా భారత్ రప్పించే విధంగా చర్యలు చేపట్టాలని పిటిషనర్ వినీత్ దండా కోరారు. దీనిపై తక్షణ విచారణ చేపట్టాలని అభ్యర్థించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్ర నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించింది. 23న విచారణ జరపనున్నట్టు ప్రకటించింది.కాగా ..పేద రైతులు బ్యాంకుల వద్ద తీసుకున్న రుణాన్ని చెల్లించలేక ఆత్మహత్యలకు పాల్పడు తుంటే మాల్యా, నీరవ్ లాంటి వాళ్లు వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు చెక్కేస్తున్నారని పిటిషనర్ ప్రస్తావించారు. సామాన్య ప్రజల హక్కులను కాపాడేందుకు సుప్రీంకోర్టు దీనిపై జోక్యం చేసుకోవాలని కోరారు. రుణా లు చెల్లించకపోవడంపై బ్యాంకు అధికారులు పేద రైతులపై దురుసుగా ప్రవర్తించిన ఘట నలు, రైతులు డబ్బు కట్టలేక ఆత్మహత్యలు చేసుకున్న పలు ఘటనలను పిటిషన్లో వివరించారు. నీరవ్ మోడీ, ఆయన మామ ఛోక్సీలు భారీ మోసాలకు పాల్పడి ఎంచక్కా కుటుంబంతో సహా సులువుగా విదేశాలకు పారిపోగలి గారని పేర్కొన్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు భారీ కుంభకోణంలో రిజర్వు బ్యాంకు నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపిం చారు. ఇలాంటి భారీ కుంభకోణాల ప్రభావం తిరిగి ప్రజలపైనే పడుతుందని.. వారి నిర్లక్ష్యం కారణంగా ప్రజలు అధిక పన్నులు చెల్లించాల్సి వస్తుందన్నారు.దీంతో ఆర్థిక మంత్రిత్వ శాఖ, న్యాయ మంత్రిత్వ శాఖ, రిజర్వు బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకులను ఈ కేసులో ప్రతివాదులుగా పేర్కొంది. నీరవ్ మోడీని వీలైనంత త్వరగా భారత్ రప్పించడానికి గల అన్ని చర్యలను తీసుకోవడంపై కేంద్రానికి మార్గదర్శకాలు జారీ చేయాలని, డబ్బు రికవర్ చేయడానికి చర్యలు వేగవంతం చేయాలని పిటిషన్లో కోరారు. అలాగే అవినీతికి పాల్పడిన పీఎన్బీ అధికారులపై చర్యలు తీసుకోవాలని, రుణాల మంజూరుకు కొత్త మార్గదర్శకాలు నిర్దేశించాలని, నిబంధనలు బాగా కఠినతరం చేయాలని కోరారు. రూ.500కోట్లు, అంతకు పైగా రుణం తీసుకునే వారి వివరాలను, రుణాలు చెల్లించని వారి జాబితాను కేంద్రం అందజేయాలని అభ్యర్థించారు.దీంతో సుప్రీం కోర్టు పై విధంగా స్పందించింది.