Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: నా ఇష్టప్రకారమే ఇస్లాం మతాన్ని స్వీకరించానని, మతం మారాలని తనపై ఎవరూ ఒత్తిడి చేయలేదని హదియా అలియాస్ అఖిల అన్నారు. ముస్లిం వ్యక్తిని ఇష్టపడి పెండ్లి చేసుకున్నందుకు లవ్జీహద్ పేరుతో వేధింపులు ఎదుర్కొంటున్న హదియా మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన భర్తతో కలిసి ఉండడానికి అవకాశం కల్పించాలని కోరుతూ మంగళవారం ఆమె పిటిషన్ దాఖలు చేశారు. భర్త (షఫీన్ జహాన్)నూ ఇష్టపూర్వకంగానే పెండ్లి చేసుకున్నానని పిటిషన్లో వివరించారు. తన తండ్రిని కొంతమంది తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. తన భర్త ఏనాడూ తన భావాలకు విరుద్ధంగా వ్యవహరించలే దన్నారు. మీడియాలో, బయట తనపై వస్తున్న వదంతులు తీవ్రంగా కలిచివే స్తున్నాయన్నారు. ఇది ఇలాగే కొనసాగితే తన చదువుపై ప్రభావం పడుతోందని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా తనకు ఇస్లామిక్ స్టేట్ సంస్థ ఐఎస్తో సంబంధాలున్నాయన్న ఆరోపణలను ఆమె ఖండించారు. బతికినా చచ్చినా భారతీయురాలిగానే ఉంటానన్నారు. దీనిపై తనను ప్రశ్నించడానికి ఎవరికీ హక్కు లేదన్నారు. ఎన్ఐఏ అధికారులు తనను ఓ తీవ్రవాదిలా భావిస్తూ వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.