Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వీసీని తొలగించాలంటూ డిమాండ్
న్యూఢిల్లీ: వైస్ చాన్స్లర్ను తొలగించాలని డిమాండ్ చేస్తూ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్యూ) విద్యార్థులు మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించారు. అకాడమిక్ కౌన్సిల్ మీటింగ్లో గతంలో ఎన్నడూ లేని విధంగా అటెండెన్స్ రూల్స్ తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో వర్సిటీ వీసీ ఎం.జగదీశ్ కుమార్ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా విద్యార్థులు నిరసన తెలుపుతూ ఆయనను తొలగించాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలోని మండీ హౌస్ నుంచి దాదాపు 1000 మంది విద్యార్థులతో ప్రారంభమైన ర్యాలీ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యాలయం వరకు కొనసాగింది. విద్యార్థులు బ్యానర్లు, ప్లకార్డులు పట్టుకొని వీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముందస్తు భద్రత కోసం మంత్రిత్వ శాఖ భవనం వద్ద దాదాపు 150కి పైగా ఢిల్లీ, కేంద్ర రిజర్వు పోలీసు బలగాలు మోహరించాయి.