Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై : సీపీఐ(ఎం) తమిళనాడు రాష్ట్ర కార్యదర్శిగా మాజీ ఎమ్మెల్యే బాలక్రిష్ణన్ ఎన్నికయ్యారు. తమిళనాడులోని ట్యుటికోరిన్లో మూడు రోజులుగా జరుగుతున్న సీపీఐ(ఎం) రాష్ట్ర 22వ మహాసభలు మంగళవారం ముగిశాయి. కాగా.. మహాసభల చివరి రోజున పార్టీ రాష్ట్ర కార్యదర్శి జి రామక్రిష్ణన్ స్థానంలో బాలక్రిష్ణన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన 1970లో విద్యార్థి దశలో ఉండగానే సీపీఐ(ఎం)లో చేరారు. విద్యార్థుల హక్కుల కోసం పోరాడుతున్న క్రమంలో 1972లో కాలేజీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. రైతులు, కార్మికుల హక్కుల కోసం నిర్విరామంగా ఉద్యమిస్తున్నారు. 2011లో రాష్ట్రంలోని చిదంబరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.