Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బెంగాల్లో సామూహిక లైంగికదాడి
నిర్భయ ఘటనను తలపించేలా చిత్రహింసలు
కోల్కతా: దేశరా జధాని లో వైద్య విద్యార్థినిపై జరిగిన లైంగికదాడి, చిత్రహింసలను తలపించేలా పశ్చిమ బెంగాల్ లో మరో ఉదంతం వెలుగు లోకొచ్చింది. మతిస్థిమితం లేని మహిళపై కొందరు వ్యక్తులు దారుణానికి ఒడిగట్టారు. ఆమె ప్రయివేటు భాగాల్లో ఇనుపరాడ్లను దూర్చి చిత్రవధకు గురిచేస్తూ... మానవ మృగాల్లా ప్రవర్తించారు. దక్షిణ దీనజ్పూర్ జిల్లా కూష్ముండిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. కూష్ముండి గ్రామంలో నివసించే ఆ మహిళ(28) తల్లిదండ్రులు పదేండ్ల క్రితమే చనిపోవడంతో స్థానికుల సహాయంతో ఒంటరిగా జీవిస్తోంది. ఈ క్రమంలో మానసిక అనారోగ్యానికి గురైంది. కాగా, అదే గ్రామానికి చెందిన కొందరు ఆమెపై కన్నేశారు. ఈ నెల 18న గ్రామంలోని జాతరకు వెళ్ళి తిరిగివస్తుండగా మార్గమధ్యలో ఆమెను అడ్డగించి పక్కనే ఉన్న పొలాల్లోకి తీసుకెళ్ళి సామూహిక లైంగికదాడికి పాల్పడుతూ ఆమెను చిత్రహింసలకు గురిచేశారు. ఆమె ప్రయివేటు భాగాల్లో ఇనుపరాడ్ల, చేతులను దూర్చి చిత్రవధ చేశారు. ఆమె స్పృహ కోల్పోగా అక్కడే వదిలి పారిపోయారు. అపస్మారక స్థితిలో పడివున్న బాధితురాలిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమందించగా ఆమెను రారుగంజ్ జిల్లా ఆస్పత్రిలో చేర్చారు. ఆస్పత్రికి తీసుకొచ్చినప్పుడు ఆమె పరిస్థితి విషమంగా ఉందనీ, శస్త్రచిక్సితచేసి ఆమె ప్రయివేటు భాగాల్లో ఉన్న ఇనుపముక్కలను బయటకు తీశామనీ వైద్యులు తెలిపారు. అప్పటికీ ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుండటంతో మాల్దా మెడికల్ కళాశాలకు తరలించారు. ఆమెకు స్పృహ రావడంతో ఘటనను పోలీసులకు వివరించింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం రాంప్రసాద్ శర్మ అనే నిందితుడిని అరెస్ట్ చేశామని మిగతా వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామని ఏడిజి అనూజ్ శర్మ తెలిపారు.