Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హాజరుకానున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
చెన్నై: తమిళనాడు సహా దేశ ప్రజలంతా ఆసక్తిగా అని ఎదురుచూస్తున్న తమిళ నటుడు కమల్హాసన్ నేడు (బుధవారం) పార్టీని ప్రకటించనున్నారు. మధురైలో సాయంత్రం 6 గంటలకు ప్రారంభమయ్యే భారీ బహిరంగ సభలో పార్టీ పేరు, విధి విధానాల్ని ఆయన ప్రకటించనున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. చెన్నై విమానాశ్రయంలో మంగళవారం తనను కలిసిన విలేకరులతో కమల్ మాట్లాడుతూ... మధురైలో బుధవారం నిర్వహించే కార్యక్రమానికి తనను ఆశీర్వదించడానికి చాలా మంది సినీ, రాజకీయ ప్రముఖులు హాజరవుతున్నారన్నారు. తనతో కలిసి వచ్చే వాళ్లందరూ నేటి సభకు హాజరుకావాలని కోరారు. అంతకుముందు.. 'తమిళనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా సార్లు మాట్లాడాను, కానీ ఇప్పుడేం మాట్లాడలేను. రేపటి సభలో అంతా మాట్లాడతాను. రేపటి నుంచి మా ప్రయాణం ప్రారంభం కాబోతుంది' అని ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ సభకు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ రావలసి ఉండగా వారి పర్యటనలు ఇంకా ఖరారు కాలేదు. ఇటీవల తన పార్టీ ప్రారంభానికి రావాలని సూపర్ స్టార్ రజినీకాంత్, డీఎంకే అధినేత కరుణానిధి, అతని కుమారుడు స్టాలిన్, డీఎండీకే అధ్యక్షుడు విజరుకాంత్ను కలిసిన సంగతి తెలిసిందే. మధురైనుంచే కమల్ తన రాజకీయ యాత్రను ప్రారంభించబోతున్నారు.