Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజస్థాన్ ప్రభుత్వ నిర్ణయం
- 'ద క్రిమినల్ లా-2017'బిల్లుపై పెద్ద ఎత్తున ప్రజాగ్రహం
జైపూర్ : అడుసు తొక్కనేల... కాళ్లుకడుక్కోనేల...అన్నట్టుంది రాజస్థాన్లోని వసుంధరారాజే ప్రభుత్వం తీరు. వివాదాస్పద బిల్లు 'ద క్రిమినల్ లా-2017'కు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో బీజేపీ ప్రభుత్వం వెనెక్కి తగ్గింది. ఈ బిల్లును తాము రద్దు చేస్తున్నామని సీఎం వసుంధరారాజే తాజాగా ప్రకటించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా న్యాయమూర్తుల్ని, మెజిస ీ్టరియల్ స్థాయి అధికారుల్ని, ప్రభుత్వ ఉన్నతాధికారుల్ని విచారి ంచడానికి వీల్లేదంటూ బీజేపీ ప్రభుత్వం చట్టం చేయాలనుకుంది.
ఈ బిల్లు ప్రకారం, ప్రభుత్వంలోని అధికారుల, రాజకీయ నాయకుల అవినీతిపై పత్రికలు కథనాలు రాయడానికి వీల్లేదు. ప్రభుత్వం విచారణకు ఆదేశించాకే పత్రికలు కథనాలు రాయాల్సి ఉంటుంది. అత్యంత వివాదాస్పదమైన 'ద క్రిమినల్ లా-2017' బిల్లును గత శాసనసభ సమావేశాల్లో బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవటంతో బిల్లును రద్దుచేస్తున్నట్టు అసెంబ్లీలో వసుంధరారాజే ప్రకటించాల్సి వచ్చింది.
ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే ముందు 2017, సెప్టెంబరు 6న రాజస్థాన్ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. 2017, అక్టోబరు 23న ఈ బిల్లును శాసనసభలో బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అన్ని వైపుల నుంచీ పెద్ద ఎత్తున వ్యతిరేకత రావటంతో ఈ బిల్లును సెలెక్ట్ కమిటీ పరిశీలనకు పంపారు.