Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అగ్ని-2 క్షిపణి పరీక్ష విజయవంతమైంది. ఒడిషాలోని అబ్దుల్ కలాం దీవిలో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్(ఐటీఆర్) నుంచి దీనిని మంగళవారం ఉదయం 8.30 గంటలకు స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్(ఎస్ఎఫ్సీ) ఆధ్వర్యంలో పరీక్షించారు. కాగా
వర్గాలు వెల్లడించాయి. అగ్ని-2 చివరి దశ పరీక్షను మే 4న నిర్వహించనున్నారు. 17 టన్నుల బరువుండి ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయాణించే ఈ క్షిపణి 2000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను సునాయసంగా చేధించగలదు. 1000 కిలోగ్రాముల వార్హెడ్స్ను మోసుకెళ్లగలదు. క్షిపణిని రూపొందించిన డీఆర్డీఓ శాస్త్రవేత్తలకు, పరీక్ష నిర్వహించిన ఎస్ఎఫ్సీ బృందానికి అభినందనలు తెలుపుతూ కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ట్వీట్ చేశారు.