Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేట్లకో న్యాయం... అన్నదాతలకు మరో న్యాయమా?
- రైతు డిమాండ్లు నెరవేర్చకపోతే పునాదులు కూలుతారు: ఏచూరి
న్యూఢిల్లీ: 88 ఏండ్ల క్రితం ఇలాగే దేశ రైతాంగం వెంటనడవగా...మహాత్మాగాంధీ బ్రిటీష్ వలసపాలన పునాదుల్ని పెకిలించారు. తద్వారా దేశానికి స్వాతంత్య్రాన్ని సాధించారు. మహారాష్ట్రలో రైతులు చేపట్టిన ఈ ఉద్యమం నాటి స్వాతంత్య్ర ఉద్యమాన్ని తలపిస్తోంది. రైతుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చకపోతే, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల పునాదుల్ని కూల్చటం ఖాయం. తమ పక్షం నిలిచే ప్రభుత్వాల్ని రైతులు ఎన్నుకుంటారు. దేశంలోని రైతులందరి రుణాల్ని మాఫీ చేయడానికి ఒక లక్ష కోట్లు అవసరమవుతాయి. ఇంతపెద్ద మొత్తాన్ని రుణ మాఫీ చేయలేమని చెబుతున్న కేంద్రంలోని మోడీ సర్కార్, మరోవైపు బడా కార్పొరేట్ వర్గాలకు లక్షల కోట్ల బ్యాంకు రుణాల్ని మాఫీ చేస్తోంది. ఇదెక్కడి న్యాయం ? తాను బతకటం కోసం రైతు రుణాల్ని తీసుకున్నాడు. అది కట్టలేని పరిస్థితి వచ్చి...ఆత్మహత్యకు పాల్పడుతున్నాడు. ఈ పరిస్థితి మార్చాలి.