Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దోషి జగ్తార్ సింగ్కు యావజ్జీవం
చంఢగీఢ్ : పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ హత్య కేసులో ప్రమేయమున్న జగ్తార్ సింగ్ తారాకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు శనివారం కీలక తీర్పు వెలువరించింది. 1995 ఆగస్టు 31న చంఢగీఢ్లోని సివిల్ సెక్రెటేరియట్ ఆవరణలో జరిగిన ఆత్మాహుతి దాడిలో అప్పటి ముఖ్యమంత్రి బియాంత్తో పాటు మరో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో 1995 సెప్టెంబర్లో అరెస్టయిన జగ్తార్... 2004లో జైలు నుంచి తప్పించుకున్నాడు. 2015లో అతడు థాయిలాండ్లో అరెస్టయి చంఢగీఢ్లోని బురె యిల్ జైలులో ఉంటున్నాడు. కాగా..శాంతి భద్రతల దృష్ట్యా బురెయిల్ జైలులోనే.. సెషన్స్ కోర్టు జడ్జి జెఎస్ సిద్దూ తీర్పు వెలువరించారు. మరోవైపు ఈ తీర్పును పై కోర్టులో సవాల్ చేయబోమని జగ్తార్ తరఫు న్యాయవాది సిమ్రాన్జిత్ సింగ్ తెలిపారు. సిక్కుల హక్కుల కోసం ప్రభుత్వంపై పోరాడుతున్నానని, ఇక ముందు కూడా కొనసాగిస్తానని జగ్తార్.. కోర్టుకు తెలిపినట్టు ఆయన వివరించారు.