Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమాజ్వాది పార్టీలో చేరిన మంత్రి అల్లుడు
లక్నో: ఇటీవలి ఉప ఎన్నికల్లో పరాజయాలతో తల బొప్పికట్టించుకున్న యూపీ అధికార పార్టీ బీజేపీకి తాజాగా మరో ఎదురు దెబ్బ తగిలింది. యోగి ఆదిత్యనాధ్ ప్రభుత్వంలో మంత్రిగా వున్న స్వామి ప్రసాద్ మౌర్య అల్లుడు నావల్ కిషోర్ శనివారం నాడు సమాజ్వాది పార్టీలో చేరారు. పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, మరో అగ్రనేత అజంఖాన్ల సమక్షంలో ఆయన సమాజ్వాది తీర్థం పుచ్చుకున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. గతంలో బిఎస్పీలో ఒబిసి నేతగా ఎదిగిన స్వామి ప్రసాద్ మౌర్య 2016 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరి ఘన విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన యోగి మంత్రివర్గంలో కార్మిక, సర్వీస్ ప్లానింగ్, పేదరిక నిర్మూలన శాఖలను నిర్వహిస్తున్నారు.