Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గోరఖ్పూర్ కలెక్టర్కు ప్రమోషన్
లక్నో: ఉత్తరప్రదేశ్లో 37 మంది ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్(ఐఏఎస్) అధికారులను బదిలీ చేస్తూ యోగి ఆదిత్యనాథ్ సర్కారు నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు శనివారం అధికారిక ఉత్తర్వులు వెలువ డ్డాయి. బదిలీ అయిన వారిలో 17 మంది కలెక్టర్లు ఉన్నారు. గోరఖ్పూర్ డిస్ట్రిక్ మేజిస్ట్రేట్గా పని చేస్తున్న రాజీవ్ రౌతేలాకు దేవీపఠాన్ డివిజనల్ కమిషనర్గా పదోన్నతి లభించింది. ఇటీవల గోరఖ్పూర్, పుల్పూర్ లోక్ సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ దారుణ పరాజయాన్ని చవి చూసిన సంగతి తెలిసిందే. ఈ రెండు స్థానాలను సమాజ్వాదీ పారీ ్ట(ఎస్పీ) కైవసం చేసుకున్నది. ఈ ఎన్నికల ఫలితాలు వెల్లడైన రెండ్రో జుల్లోనే యూపీ ప్రభుత్వం.. అధికారులను బదిలీ చేయడం గమనార్హం. గోరఖ్ఫూర్ స్థానానికి ఓట్ల లెక్కింపు వివరాలు తెలుసుకోకుండా మీడి యాను నిషేధించి రాజీవ్ రౌతేలా వివాదంలోకెక్కారు. కాగా.. యోగి సర్కారు చేపట్టిన ఐఏఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా రాజీవ్కు ప్రమో షన్ దక్కడం గమనార్హం. కాగా 43 మంది ఐపీఎస్లను యోగి సర్కార్ బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.