Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒడిషా సెంట్రల్ యూనివర్సిటీ నిరవధికంగా మూసివేత
ఒడిషా: డిమాండ్లు పరిష్కరించాలని విద్యార్థులు చేస్తున్న ఆందోళనల నేపథ్యంలో ఒడిషా సెంట్రల్ యూనివర్సిటీ నిరవధికంగా మూతపడింది. శాశ్వత అధ్యాపకులను నియమించడం, ఆరోగ్య సంరక్షణ కేంద్రాల ఏర్పాటు, పరిశోధనా విద్యార్థులకు హాస్టల్ వసతులు కల్పించడం, పరిపాలన కార్యాలయాన్ని ప్రధాన క్యాంపస్కు మార్చాలనే ప్రధాన డిమాండ్లతో పాటు 60 డిమాండ్లను నెరవేర్చాలంటూ యూనివర్సిటీ విద్యార్థులు కోరాపుట్ క్యాంపస్లో కొన్ని రోజుల నుంచి ఆందోళనలు కొనసాగిస్తున్నారు. విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో యూనివర్సిటీని గురువారం నుంచి నిరవధికంగా మూసివేస్తూ వైస్ ఛాన్స్లర్ సచ్చిదానంద మొహంతి ఆదేశాలు జారీ చేశారు. క్రమశిక్షణను కొనసాగించడానికే ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని మొహంతి చెప్పారు. దీంతో విద్యార్థులంతా ఈ నెల 15లోగా హాస్టళ్లను ఖాళీ చేయాలని జాయింట్ రిజిస్ట్రార్ కెవి ఉమారావ్ నోటిఫికేషన్ను జారీ చేశారు. కాగా, డిమాండ్లు ఫలించని కారణంగానే బుధవారం సాయంత్రం ధర్నా నిర్వహించామని విద్యార్థులు తెలిపారు.