Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేం ప్రేమ, సోదరభావంతో ముందుకు : రాహుల్
న్యూఢిల్లీ: నరేంద్రమోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ద్వేషం, ఆగ్రహాన్ని(కోపాన్ని) వ్యాపింపజేస్తున్నదని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ విమర్శించారు. దేశాన్ని స్నేహం, ప్రేమతో ముందుకు నడిపించేది కాంగ్రెస్ ఒక్కటేనని రాహుల్ అన్నారు. కాంగ్రెస్ చేయి(ఎన్నికల గుర్తు) మాత్రమే దేశాన్ని ఐక్యం చేస్తుందని రాహుల్ అన్నా రు. వారు ద్వేషం, కోపాన్ని వ్యాపింపజేస్తుండగా.. తాము ప్రేమ, సోదరభావాన్ని వ్యాపింపజేస్తున్నామని రాహుల్ అన్నారు. బీజేపీకీ, కాంగ్రెస్కు తేడా అదేనన్నారు. యువ తనూ,సీనియర్లనూ సమన్వయం చేస్తూ పార్టీని నడిపిస్తానని రాహుల్ అన్నారు. పార్టీ నిర్వహణలో మార్పు ఉన్నప్పటికీ గతాన్ని, వారసత్వాన్ని మరిచిపోమని రాహుల్ అన్నారు. సీనియర్ల అనుభవం తోడు లేకుండా యువత పార్టీని ముందుకు నడిపించలేరని రాహుల్ స్పష్టం చేశారు. ఈ దేశం అన్ని మతాలవారిది, అన్ని కులాలవారిది, అంద రిదీ..కాంగ్రెస్ పార్టీ కూడా అందరిదీ అని రాహుల్ అన్నారు.
కాంగ్రెస్ పార్టీ 84వ ప్లీనరీ సమావేశాల్లో రాహుల్ ప్రసంగించారు. రాహుల్గాంధీ తొలిసారి అధ్యక్ష హోదాలో ఈ ప్లీనరీలో ప్రసంగించారు. శుక్రవారం ప్రారంభమైన ప్లీనరీ సమావేశాలు ఆదివారం ముగియనున్నాయి. ఈ సమావేశాలకు కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్,లోక్సభలో కాంగ్రెస్పక్ష నేత మల్లికార్జున్ఖర్గే, పార్టీ సీనియర్ నేతలు, వివిధ రాష్ట్రాల నుంచి ఏఐసీసీ ప్రతినిధులు హాజరయ్యారు.