Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎలాంటి చర్చ లేకుండానే లోక్సభ ఆమోదం
న్యూఢిల్లీ: దేశంలోని రాజకీయ పార్టీలకు అందుతున్న విదేశీ విరాళాలపై పర్యవేక్షణ మినహాయింపును సూచించే బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. ఎలాంటి చర్చ జరగకుండానే ఈ బిల్లు పాస్ కావడం గమనార్హం. రాజకీయ పార్టీలకు విదేశాల నుంచి విరాళాలు అందడాన్ని సులభతరం చేసే చర్యలో భాగంగా మోడీ సర్కారు ఈ బిల్లును తీసుకొచ్చింది. ఫారెన్ కంట్రిబ్యూషన్ (రెగ్యులేషన్) యాక్టు-2010 ప్రకారం.. పార్టీలకు విదేశీ విరాళాలు అందే విషయమై షరతులున్నాయి. ఇదిలా ఉంటే.. ప్రతిపక్షాల తీవ్ర ఆందోళనల నడుమ ఆర్థిక బిల్లు-2018లో 21 సవరణలకు లోక్్సభ బుధవారం ఆమోదం తెలిపింది. కాగా.. దీనిలో ఫారెన్ కంట్రిబ్యూషన్ (రెగ్యులేషన్) యాక్టు-2010 సవరణ బిల్లు కూడా ఉన్నది.