Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒకరు మృతి, ఏడుగురికి తీవ్ర గాయాలు
చండీగఢ్: హర్యానాలోని సోనిపాట్ జిల్లాలో రారు ఇండిస్టియల్ ఏరియాలోని కెమికల్ ఫ్యాక్టరీలో ఆదివారం మంటలు చెలరేగాయి. మంటల్లో ఒక కార్మికుడు సజీవదహనం కాగా కొన్ని అస్థికలు లభించాయి. ఇందులో ఏడుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం..సోనిపాట్లో ఇండిస్టియల్ ఏరియాలోని కెమికల్ ఫ్యాక్టరీకి చెందిన మూడు యూనిట్లలో మంటలు చెలరేగాయి. ఇందులో ఓ కార్మికుడు మంటల్లో సజీవదహనం కాగా ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. లభించిన అస్థికలు ఎంతమందివో తెలియరాలేదు, వాటని ఫోరెన్సిక్ పరీక్షల కోసం ల్యాబ్కు పంపించారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. అగ్నిమాపక యంత్రాల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఫ్యాక్టరీలో పనిచేసేవారిలో చాలామంది ఉత్తరప్రదేశ్ నుంచి వలస వచ్చినవారని పోలీసు అధికారి తెలిపారు.