Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైఎస్సార్సీపీ,టీడీపీ నోటీసులపై నోరువిప్పిన అమిత్షా
న్యూఢిల్లీ: మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని చాలా సునాయాసంగా ఓడిస్తామని బీజేపీ అధ్యక్షుడు అమిత్షా చెప్పారు. ఎన్డీయేకు 300కు పైగా సభ్యుల మెజారిటీ ఉన్నదని తెలిపారు. ఏపీకి ప్రత్యేక హౌదా కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇవ్వడంపై అమిత్షా తొలిసారి మాట్లాడుతూ, 'అవిశ్వాస తీర్మానాన్ని ఇంత ఆలస్యంగా ఎందుకు పెడుతున్నారు? మేం అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. నిబంధనల ప్రకారం సభలో చర్చ జరగాల్సి ఉంటుంది. ఓటింగ్ అంటూ జరిగితే సభలో ఓడిపోతామని కాంగ్రెస్, ఇతర పార్టీలకు బాగా తెలుసు. అందుకే సభను సజావుగా సాగకుండా అడ్డుకుంటున్నారు' అని అమిత్షా ఆరోపించారు.