Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యమునా ఎక్స్ప్రెస్ హైవేపై రోడ్డు ప్రమాదం
న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదాల కు అడ్డాగా మారిన యమునా ఎక్స్ప్రెస్ హైవే (ఢిల్లీ-ఆగ్రా) మరోసారి నెత్తురోడింది. మిత్రుడి పుట్టిన రోజు వేడుకల నిమిత్తం ఢిల్లీ నుంచి ఆగ్రాకు ఏడుగురు డాక్టర్లు బయల్దేరారు. ఆదివారం రాత్రి మథుర వద్ద భారీ కంటైనర్ వారి వాహనాన్ని ఢకొీనడం తో ముగ్గురు డాక్టర్లు అక్కడికక్కడే మృతి చెందా రు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. పోలీ సుల కథనం మేరకు... ఢిల్లీ నుంచి ఆగ్రాకు ఆది వారం రాత్రి ఇన్నోవాలో బయల్దేరిన ఎయిమ్స్ వైద్యుల బృందం.. 2 గంటల సమీపంలో సురీర్ కొత్వాలీ వద్ద భారీ కంటైనర్ ఢకొీనడంతో యశ్ ప్రీత్(25), హేంబాలా(26), హర్షద్(35)లు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల ద్వారా సమాచార మందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరు కుని గాయపడిన వారిని మథురలోని స్థానిక ఆస్ప త్రికి తరలించారు. బాధితుల పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని ఢిల్లీకి తరలించారు.