Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 40 శాతం నేరాలు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లోనే
న్యూఢిల్లీ: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నేరాలు రాజ్యమేలుతున్నాయి. దేశంలో వృద్ధులపై నేరాల్లో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లు ముందు వరుసలో ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాలు బీజేపీ పాలిత రాష్ట్రాలే కావడం గమనార్హం. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం..గడిచిన మూడేండ్లలో వృద్ధులపై నేరాలకు సంబంధించి నమోదైన కేసుల్లో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుంచే 40 శాతం ఉన్నాయంటే అక్కడి పరిస్థితి ఎంత దయనీయంగా ఉన్నదో అర్థమవుతున్నది. 2014లో దేశవ్యాప్తంగా నమోదైన 18,714 కేసు ల్లో ఈ రెండు రాష్ట్రాల నుంచి 7,419(39.64 శాతం) ఉన్నాయి. 2015లో 20,532, 2016లో 21,410 కేసులు నమోదు కాగా.. ఎంపీ, మహారాష్ట్ర నుంచి వరుసగా 8,017, 8,571(40.03 శాతం) ఉన్నాయి. దీన్ని బట్టి ఏడాది కాలంలో ఈ రాష్ట్రాల్లో 500 కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. వృద్ధులపై నేరాల్లో మహారాష్ట్ర దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నది. మధ్యప్రదేశ్ తర్వాతి వరుసలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీ ఉన్నాయి. జమ్మూకాశ్మీర్లో వృద్ధులపై నేరాలకు సంబంధించి గడిచిన మూడేండ్లలో ఒక్క కేసూ నమోదు కాకపోవడం గమనార్హం.