Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అపోలో చైర్మెన్ ప్రతాప్రెడ్డి
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణించి ఏడాదిన్నర కావస్తోన్నా.. ఆమె మరణం అంతులేని అనుమానాలకు తావిస్తోంది. జయ మరణంపై మీడియాలో వార్తలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తాజాగా అపోలో ఆస్పత్రి చైర్మన్ సి.ప్రతాప్ రెడ్డి 'అమ్మ' మరణంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జయలలిత ఆస్పత్రిలో ఉన్నన్ని రోజులు ఐసీయూలో సీసీటీవీలన్నీ ఆఫ్ చేశామన్నారు. చెన్నైలో బుధవారం జరిగిన ఇంటర్నేషనల్ కొలొరేక్టల్ సింపోసియమ్-2018 పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతాప్రెడ్డి మాట్లాడుతూ... జయలలిత ఆస్పత్రిలో చేరాక ఐసీయూలో ఆమె ఉంటున్న గదిని తప్ప అందరినీ ఖాళీ చేయించామన్నారు. దాదాపు 75 రోజులు చికిత్స పొందిన ఆమె కోరిక మేరకే సీసీటీవీలు ఆఫ్ చేశామని చెప్పారు. ఆమె చెప్పిన సన్నిహితుల్ని మాత్రమే ఐసీయూలోకి అనుమతించామని తెలిపారు. జయను బతికించడానికి తమ వంతు బాధ్యతగా చేయవలసిందంతా చేశామన్నారు. దురదృష్టవశాత్తూ గతేడాది డిసెంబర్ 4న గుండెపోటుకు గురై ఆమె మరణించడం బాధాకరమన్నారు. జయ మరణంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ అరుముగస్వామి నాయకత్వంలో ఏకసభ్య కమిషన్ విచారణలో హాజరైనప్పుడు దీనికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు సమర్పించామన్నారు.