Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వివిధ రాష్ట్రాల నుంచి రోజుకు సగటున 300మంది
న్యూఢిల్లీ: ఉపాధి నిమిత్తం వివిధ రాష్ట్రాల నుంచి దేశ రాజధాని ఢిల్లీకి వలసలు విపరీతంగా పెరుగుతున్నాయి. 2016లో రోజుకు సగటున 300మంది పనిని వెతుక్కుంటూ వచ్చి ఢిల్లీలో స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. ఢిల్లీలో 2013 నుంచి 2016ఏండ్ల మధ్య పెరుగుతున్న జనాభా, వలసదారుల డేటా సేకరించిన ఓ సర్వేలో ఈ విషయం తెలిసింది. 2016లో ఢిల్లీ జనాభా రోజుకు 1000మంది చొప్పున పెరగ్గా అందులో 300మంది వలసదారులే ఉన్నారు. గత 15ఏండ్లలో ఇదే అధికం. ఈ రాష్ట్రంలో సేవారంగం గణనీయంగా వృద్ధి చెందడం, ఇతర రాష్ట్రాల కంటే ఇక్కడ తలసరి ఆదాయం(ఏడాదికి 3.3లక్షల రూపాయలు) అత్యధికంగా ఉండటం ఈ వలసలకు ప్రధాన కారణంగా ఉన్నట్టు తెలుస్తోంది. విపరీతంగా పెరుగుతున్న జనాభాతో రాష్ట్రంలో ప్రజలు కిక్కిరిసిపోయి జీవనం సాగిస్తున్నారు. చదరపు కిలోమీటరుకు 12,542మందితో.. దేశంలోనే ఢిల్లీ అత్యధిక జనసాంధ్రతను కలిగి ఉన్నది. దేశవ్యాప్తంగా ఇదే జనసాంధ్రత ఉంటే దేశ జనాభా మొత్తం ఒక్క బీహార్లోనే జీవించవచ్చు. అయితే ఢిల్లీలో పెరుగుతున్న ఈ జనాభాతో పలు మౌళిక సమస్యల కొరత ఏర్పడుతోంది. కాగా ఈ జనసాంధ్రతతో వాయుకాలుష్యం మరింత జటిలంగా మారుతోంది. శీతాకాలంలో రోడ్లు కనిపించలేనంత వాయుకాలుష్యంతో నిండిపోయిన ఢిల్లీని గ్యాస్ చాంబర్గా ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్న విషయం తెలిసిందే.