Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాబుల్: అఫ్ఘనిస్తాన్లో ఉగ్రవాదులు మరోసారి విరుచుకుపడ్డారు. హెల్మాండ్ ప్రావిన్స్లో కారుబాంబు పేలి శుక్రవారం 13 మంది మృతి చెందారు. హెల్మాండ్లోని హయతుల్లా స్టేడియం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందులో దాదాపు 35 మంది గాయపడినట్టు అధికారులు తెలిపారు. అఫ్ఘాన్లో ఈ నెలలో వరుసగా ఇది మూడో ఘటన. రెండు రోజుల క్రితం కాబుల్లో ఉగ్రవాదులు పేల్చిన కారుబాంబులో దాదాపు 32 మంది మృతి చెందగా, 52 మందికి గాయాలయ్యాయి. ఈ నెల 17న ఫరా ప్రావిన్స్లో పేలుళ్లు సంభవించి 10 మంది సెక్యూరిటీ అధికారులు మృతి చెందిన విషయం తెలిసిందే.