Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మధ్యప్రదేశ్ గిరిజన హాస్టల్లో..
గుణ(మధ్యప్రదేశ్): పరీక్షల సమయం ఎంతో శ్రద్ధపెట్టాలి. ఇంతటి విలువైన సమయంలో ఓ హాస్టల్లో పిల్లలతోనే వంట చేయించిన ఘటన మధ్యప్రదేశ్లోని గుణలో చోటు చేసుకున్నది.గుణలోని జూనియర్ గిరిజన వసతి గ హంలో ఉన్న విద్యార్థులతో ప్రతిరోజూ వంట చేయిస్తున్నారు. అక్కడ సిబ్బంది ఉన్నా వంటమాత్రం పిల్లలు చేయాల్సిందే. మిగతా పిల్లలమాట అటుంచితే పరీక్షలు రాస్తున్న పదోతరగతి విద్యార్థులతోనూ చపాతీలు చేయించిన ఘటన వెలుగులోకి వచ్చింది. అంతేకాదు అక్కడుండే విద్యార్థుల తోనే మరుగుదొడ్లు కడిగించడం, వంటపాత్రలు తోమించడం, హాస్టల్ మొత్తాన్ని శుభ్రం చేయించడం వంటివి చేయిస్తున్నారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టరు రాజేష్ జైన్ హాస్టల్ సూపరింటెండెంట్ పై వేటు చేశారు.