Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాల్బుర్గీ హత్య కేసులో కర్నాటక, గోవా, మహారాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం ఆదేశం
న్యూఢిల్లీ : ప్రముఖ హేతువాది ఎంఎం కాల్బుర్గీ హత్య కేసుకు సంబంధించి నాలుగువారాల్లో అఫిడవిట్లను దాఖలు చేయాల్సిందిగా కర్నాటక, గోవా, మహారాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసు ఎన్ఐఏ పరిధిలోకిరాదని, అందువల్ల విచారణను ఆ దర్యాప్తు సంస్థకు అప్పగించలేమని కేంద్రం సుప్రీంకోర్టుకు శుక్రవారం తెలిపింది. కాల్బుర్గీ కేసును సిట్లో విచారణ జరిపించాలని కోరుతూ ఆయన భార్య ఉమాదేవి కాల్బుర్గీ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు జనవరిలో కేంద్రానికి నోటీసులు జారీచేసింది. తన భర్త, వామపక్ష నేత గోవింద్పన్సారే, ప్రముఖ హేతువాది నరేంద్ర దబోల్కర్ల హత్యల్లో సారూప్యతలున్నాయని ఆమె తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పై మూడు రాష్ట్రాలకు నోటీసులు జారీచేసిన సుప్రీంకోర్టు, నాలుగు వారాల్లో అఫిడవిట్లు దాఖలు చేయాల్సిందిగా ఆదేశించింది. ప్రముఖ విద్యావేత్త, కన్నడ రచయిత, సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కాల్బుర్గీ 2015 ఆగస్టు 30న కర్నాటక ధార్వాడ్లో కళ్యాణ్ నగర్లోని తన ఇంటిలోనే హత్యకు గురయ్యారు.