Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆప్ ఎమ్మెల్యేలకు ఊరట
న్యూఢిల్లీ: 'లాభదాయక పదవులు' పొందారంటూ ఢిల్లీ రాష్ట్ర అసెంబ్లీని ఓ కుదుపు కుదిపిన పార్లమెంటరీ కార్యదర్శుల నియామకం కేసులో 20 మంది ఆప్ ఎమ్మెల్యేలకు ఊరట లభించింది. వేటు పడిన ఎమ్మెల్యేల పిటిషన్ను శుక్రవారం పరిశీలించిన ఢిల్లీ హైకోర్టు.. ఎన్నికల కమిషన్ (ఈసీ) నిర్ణయాన్ని పక్కన పెట్టాలని సూచించింది. ఎమ్మెల్యేల అనర్హత నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని ఈసీని ఆదేశించింది. తీర్పుపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలపై అక్రమంగా కేసులు పెట్టారన్నారు. న్యాయం గెలిచిందని.. ఇది ఢిల్లీ ప్రజల విజయమని అభివర్ణించారు.