Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశం విడిచి వెళ్లొద్దన్న ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో జ్యుడిషియల్ కస్టడీ ఎదుర్కొంటున్న కార్తీ చిదంబరానికి ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ. 10 లక్షల పూచీకత్తుతో కోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది. దేశం విడిచి వెళ్లొద్దని, తన పేరు మీద ఉన్న బ్యాంకు అకౌంట్లను మూసివేయకూడదని కార్తీని ఆదేశించింది. నిందితుడు సాక్ష్యుల్ని ప్రభావితం చేసే అవకాశముందని, ఆయనకు బెయిల్ ఇవ్వకూడదన్న సీబీఐ వాదనలను కోర్టు తోసిపుచ్చింది. ఈ కేసుకు సంబంధించి ఈడీ రంగంలోకి దిగింది. ఢిల్లీ ముంబయిలలో సోదాలు నిర్వహించింది.
ఎయిర్సెల్-మ్యాక్సిస్ కేసులో ముందస్తు బెయిల్ కోరిన కార్తీ
ఎయిర్సెల్-మ్యాక్సిస్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్తీ.. ముందస్తు బెయిల్ కోరుతూ ఢిల్లీ సిటీ కోర్టును ఆశ్రయించారు. 2012-13లో సంచలనం సృష్టించిన ఈ కేసులో ఎయిర్సెల్ సంస్థలో పెట్టుబడులు పెట్టడానికి గ్లోబల్ కమ్యూనికేషన్ హోల్డింగ్ సర్వీసెస్కు ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎఫ్ఐపీబీ) నుంచి క్లీయరెన్స్లు ఇప్పించారనే ఆరోపణలున్నాయి. ఈ పిటిషన్ను కోర్టు శనివారం విచారణకు స్వీకరించనుంది.