Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ గురువారంనాడు అస్వస్థకు గురయ్యారు. ప్రియాంక గాంధీ వాద్రా నిర్మిస్తున్న ఇంటిని చూసేందుకు సిమ్లా వెళ్ళిన ఆమె అస్వస్థతకు గురవ్వడంతో చికిత్స కోసం శుక్రవారం ఉదయం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తీసుకొచ్చారు. ప్రియాంకా, సోనియా ఇరువురు రోడ్డు మార్గానా చండీగఢ్ నుంచి సిమ్లాకు 14 కిలోమీటర్ల దూరంలోని ఛారాబ్రా గ్రామానికి గురువారం వెళ్లారు. అక్కడ ఆమె అస్వస్థతకు గురయ్యారు. సిమ్లాలోని ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీ(ఐజీఎంసీ)లో చికిత్సకు ఆమె నిరాకరించడంతో ఆమెను ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నదని వైద్యులు తెలిపారు.