Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తిరోగమన ఆర్థిక విధానాలు, మతోన్మాద చర్యలకు వ్యతిరేకంగా ఉద్యమిద్దాం : సీఐటీయూ జనరల్ కౌన్సిల్లో తపన్సేన్ పిలుపు
- పతాకాన్ని ఆవిష్కరించిన అధ్యక్షులు కె. హేమలత
కోజికోడ్: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు ప్రజల, కార్మికుల జీవితాలను చిత్రం చేస్తున్నాయని, అనేక పోరాటాలతో కార్మికవర్గం సాధించుకున్న చట్టాలు, సామాజిక భద్రతా పథకాలను నిర్వీర్యం చేస్తున్నాయని, రాష్ట్రాల మధ్య ఐక్యత రాకుండా మత ప్రాతిపదికన సమస్యలను చర్చించేందుకు ప్రయత్నిస్తున్నదని, కాబట్టి ఆర్థిక విధానాలు, మతోన్మాద చర్యలకు వ్యతిరేకంగా దేశ కార్మికవర్గం పోరాటాలు చేయాలని సీఐటీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి తపన్సేన్ పిలుపునిచ్చారు. సీఐటీయూ జనరల్ కౌన్సిల్ సమావేశాలు మార్చి 23 నుండి 26 వరకు కేరళ రాష్ట్రంలో కోజికోడ్లో మహమ్మద్ అమీన్ నగర్ (టాగూర్ ఆడిటోరియం)లో ప్రారంభమయ్యాయి. తొలుత సీఐటీయూ సంఘం జెండాను అధ్యక్షులు కె. హేమలత ఆవిష్కరించి, అధ్యకోపన్యాసం చేశారు. నూతన ఆర్థిక విధానాలను అమలు చేస్తున్న ప్రపంచ దేశాలలో ప్రజలు, కార్మికుల పరిస్థితులు, జరుగుతున్న పోరాటాలు, అనుభవాలు, మతవాదశక్తులు బలపడడంతో పాటు లాటిన్ అమెరికాలో వామపక్ష ప్రభుత్వాలు, సోషలిస్టు దేశాలు అనుభవాలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ప్రారంభసభ అనంతరం ప్రధాన కార్యదర్శి నివేదికను తపన్సేన్ ప్రవేశపెట్టారు. 2016 నవంబర్లో ఒరిస్సాలో జరిగిన 15వ అఖిల భారత మహాసభ, 2017 జూలైలో సిమ్లాలో జరిగిన వర్కింగ్ కమిటీ చేసిన నిర్ణయాలు, అనుభవాలు నివేదికను జనరల్ కౌన్సిల్ ముందుంచారు. గడిచిన కాలంలో మనం స్వతంత్ర కార్యాచరణ చేయడమే కాక ఐక్యపోరాటాలకు విశేష కృషి చేశామని, 2017 నవంబర్ 17న సీఐటీయూ విశేష కృషి చేసిందని అన్నారు. వెనువెంటనే జనవరి 17న స్కీమ్ వర్కర్స్ దేశవ్యాప్త సమ్మెను జయద్రంగా జరిగిందన్నారు. ప్రభుత్వం, యాజమాన్యాల విధానాలకు వ్యతిరేకంగా అనేక రంగాలలో పోరాటాలు ముందుకొచ్చాయని అన్నారు. బ్యాంకింగ్, టెలికం, పోస్టల్, ఇన్సూరెన్స్ రంగాలలో ఉద్యోగులు, అధికారులు కూడా పోరాటాలలో కలిసి వచ్చారన్నారు. ప్రభుత్వ విధానాల వల్ల సమస్య వచ్చినప్పుడు పోరాటం చేసే పద్ధతిని వదిలేసి, విధానాలను వెనక్కి నెట్టి, సంస్థ రక్షణ, సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు నిర్వహించాలన్నారు. సీఐటీయూ కున్న సిద్ధాంతాన్ని ఆయుధంగా ఉపయోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. పైనుండి కింది స్థాయి కమిటీ వరకు రాజకీయ విద్యనందించేందుకు కృషి చేస్తున్నామని పి. రామ్మూర్తి మెమోరియల్ స్కూల్ త్వరలో తన పనిని ప్రారంభిస్తుందని అన్నారు.
1993లో సీఐటీయూ నిర్మాణంలో ఆమోదించుకున్న భువనేశ్వర్ డాక్యుమెంట్ను ప్రస్తుత కాల పరిస్థితులు, నిర్మాణ అవసరాలకు అనుగుణంగా మార్పులు, సీఐటీయూ బైలాస్లో అనేక సవరణలతో కూడి ప్రతిపాదనలను సమావేశంలో ప్రతిపాదించారు.
రెండు తీర్మానాలు ఆమోదం
త్రిపురలో లెఫ్ట్ ఓటమి చెంది, బీజేపీ అధికారంలోకి రాగానే ప్రజలపై దాడులు చేయడాన్ని, ఆఫీసులను ఆక్రమించుకోవడమే కాక, అనేక మందిని నిరాశ్రయుల్ని చేడాన్ని ఖండిస్తూ త్రిపుర ప్రజలకు సంఘీభావం తెలియజేస్తూ ఒక తీర్మానాన్ని, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయిమెంట్కు వ్యతిరేకంగా కేరళలో ఏప్రిల్ 2న జరగనున్న సమ్మెను బలపరుస్తూ మరో తీర్మానాన్ని సమావేశం ఆమోదించింది.
పలు సంఘాల నేతల సంఘీభావం
ఇన్సూరెన్స్, బ్యాంక్, డిఫెన్స్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు, తదితర సంఘాల నాయకులు తమ సంఘీభావాన్ని తెలియజేస్తూ ప్రసంగించారు. ఆహ్వాన సంఘం అధ్యక్షుడు, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎలమార్కు. కరీం అధ్యక్షపన్యాసం చేశారు.