Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : లోక్పాల్ కోసం సామాజిక కార్యకర్త అన్నా హజారే శుక్రవారం ఉదయం నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. ఢిల్లీలోని చారిత్రాత్మక రామ్లీలా మైదానంలో హజారే ఈ దీక్షను చేపట్టారు. సమర్థ లోక్పాల్ను నియమించాలని, వ్యవసాయోత్పత్తులకు మెరుగైన ధరలు కల్పించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. 2011ల అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని ఇదే మైదానంలో హజారే ప్రారంభించిన విషయం తెలిసిందే. అవినీతి నిర్మూలన లక్ష్యంగా ఉద్యమించిన ఆయనకు లభించిన విశేష స్పందన నేపథ్యంలో కాంగ్రెస్ లోక్పాల్ చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే కాలాంతరంలో జన్ లోక్ పాల్ కోసమే ఆయన పట్టుబట్టారు. బీజేపీ తన మ్యానిఫెస్టోలో సమర్థ లోక్ పాల్ కోసం హామీ ఇచ్చినప్పటికీ.. చేతల్లో మాత్రం అది సాధ్యం కాలేదు. దీంతో హజారే శువ్రకారం ఈ దీక్షను ప్రారంభించారు. --