Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 13 మంది చిన్నారులు మృతి ొఉత్తరప్రదేశ్లో దారుణం
లక్నో: ఉత్తరప్రదేశ్లోని ఖుషీనగర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రైల్వే క్రాసింగ్ వద్ద పట్టాలు దాటుతున్న స్కూలు బస్సును వేగంగా వచ్చిన ప్యాసింజర్ రైలు ఢకొీట్టడంతో 13 మంది చిన్నారులు మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం... డివైన్ పబ్లిక్ స్కూలుకు చెందిన స్కూలు వ్యాను 25 మంది విద్యార్థులతో పాఠశాలకు వెళ్తుంది. స్కూలు వ్యాను బెహ్వపూర్ రైల్వే క్రాసింగ్ వద్ద పట్టాలు దాటుతుండగా.. అదే సమయంలో శివన్ నుంచి గోరఖ్పూర్కు వెళ్తున్న థావే-కపటన్గంజ్ ప్యాసింజర్ రైలు వ్యాన్ను ఢకొీట్టింది. డ్రైవర్తో పాటు 13 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరో 8 మందికి తీవ్ర గాయాలవ్వడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. వ్యాన్లో ప్రయాణిస్తున్న వారిలో అందరూ పదేండ్లలోపు చిన్నారులే కావడం గమనార్హం. అయితే రైల్వే క్రాసింగ్ వద్ద ఎవ్వరూ లేకపోవడంతో ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన చిన్నారులకు రూ. 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు.
దర్యాప్తునకు ఆదేశించిన రైల్వే మంత్రి
ఖుషీనగర్ ఘటనపై కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ దర్యాప్తుకు ఆదేశించారు. ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఘటన చాలా బాధాకరమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఘటనలో మృతి చెందిన వారికి రూ. 2 లక్షలు, గాయాలపాలైన వారికి రూ. 1 లక్ష నష్ట పరిహారం ప్రకటించారు.
3,479.. సిబ్బంది లేని రైల్వే క్రాసింగ్లు
ఈ ఘటనతో రైల్వేల్లో నిర్లక్ష్యం మరోసారి బట్టబయలైంది. దేశవ్యాప్తంగా 3,479 రైల్వే క్రాసింగ్ల వద్ద సిబ్బంది లేకపోవడంతో ప్రతీ యేటా పదుల సంఖ్యలో రైలు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. పట్టాలు దాటుతున్నప్పుడు రైలు ఢకొీట్టిన ఘటనల్లో.. 2014-15 నుంచి 109 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగినప్పుడే హడావుడి చేసే రైల్వే శాఖ సిబ్బంది.. తర్వాత నష్ట నివారణ చర్యలకు పూనుకోకపోవడంతో ఈ ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి.
ఢిల్లీలో మరో ఘటన..
న్యూఢిల్లీ: స్కూల్ వ్యాన్ను ఎదురుగా వస్తున్న మిల్క్ ట్యాంకర్ ఢకొీట్టడంతో ఓ విద్యార్థిని (7) మృతి చెందగా మరో 18 మంది చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. ఉత్తర ఢిల్లీలోని కన్హయ్యనగర్ మెట్రో స్టేషన్కు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. వాజీపూర్ కాలనీకి చెందిన విద్యార్థులు స్కూల్ వ్యాన్లో పాఠశాలకు వెళ్తుండగా మిల్క్ ట్యాంకర్ ఢకొీట్టింది. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. కాలం చెల్లిన స్కూల్ వ్యాన్ వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని చిన్నారుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
యోగికి నిరసనల సెగ...
ఘటనానంతరం బాధితులను పరామర్శించడానికి వచ్చిన యోగీకి స్థానికుల నుంచి నిరసన ఎదురైంది. మృత దేహాలను ఉంచిన ఖుషీనగర్ జిల్లా ఆస్పత్రి నుంచి ఘటనాస్థలికి చేరుకున్న ఆయనను స్థానికులు అడ్డుకున్నారు.
రైల్వే సిబ్బందికి, స్థానిక అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో సహనం కోల్పోయిన యోగీ.. 'నినాదాలు ఆపండి, డ్రామాలు కట్టిపెట్టండి. నేను ఇక్కడకు వచ్చింది బాధితులను పరామర్శించడానికి' అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.