Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలి: దళిత సంఘాల డిమాండ్
/చెన్నై: ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టంపై సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు నిరసనగా తమిళనాడులో పెద్దఎత్తున ఆందోళనలు జరిగాయి. చెన్నైలో పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అయితే, ఏఐఏడీఎంకే ప్రభుత్వం నగరంలోకి వెళ్లేందుకు తమకు అనుమతి ఇవ్వలేదని దళిత ఆందోళనకారులు తెలిపారు. రెండు,మూడు కిలోమీటర్లమేర తమ కార్యకర్తలు గుమి కూడారని వారు తెలిపారు. ఎస్సీ,ఎస్టీలకు రక్షణ కల్పించే చట్టాన్ని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ర్యాలీలో పాల్నొన్నవారిలో విదుతలాల్ చిరుతైగల్ కచ్చి(వీసీకే), ఆర్పీఐ, తమిజగ మక్కల్ మున్నేట్ర కజగం, ఆదితమిజర్ మక్కల్ కచ్చి, బీఎస్పీ, పురచ్చి భారతం సంఘాలకు చెందినవారున్నారు. తమ కార్యకర్తలు గుమి కూడారని వారు తెలిపారు. ఎస్సీ,ఎస్టీలకు రక్షణ కల్పించే చట్టాన్ని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ర్యాలీలో పాల్నొన్నవారిలో విదుతలాల్ చిరుతైగల్ కచ్చి(వీసీకే), ఆర్పీఐ, తమిజగ మక్కల్ మున్నేట్ర కజగం, ఆదితమిజర్ మక్కల్ కచ్చి, బీఎస్పీ, పురచ్చి భారతం సంఘాలకు చెందినవారున్నారు.