Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీకి సుప్రీం ఝలక్
- సాయంత్రం 4 గంటలకు ముహుర్తం
- ఆంగ్లో-ఇండియన్ ఎమ్మెల్యే నియామకం నిలుపుదల
- కీలకమైన విధానపర నిర్ణయాలు తీసుకొవద్దని యెడ్డీకి ఆదేశం
- గవర్నర్ నిర్ణయం చట్టబద్ధతపై విచారణ కొనసాగిస్తామని వెల్లడి
- పది వారాలకు కేసు వాయిదా
భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి సుప్రీంకోర్టులో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. మెజార్టీ నిరూపణకు బీజేపీ సీఎం యడ్యూరప్పకు గవర్నర్ ఇచ్చిన 15 రోజుల కాలవ్యవధిని సర్వోన్నత న్యాయస్థానం కుదించింది. నేడు సాయంత్రం 4 గంటలకు బలపరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. ఇరుపక్షాలు మెజార్టీ తమకే ఉందని ప్రకటిస్తున్న నేపథ్యంలో 'అసెంబ్లీలో బలపరీక్షతో నిరూపించుకోండి' అని ఆదేశించింది. ప్రొటెం స్పీకర్ ఈ వ్యవహారం పూర్తిచేయాలని ఆదేశించిన న్యాయస్థానం... అప్పటివరకు కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం లేదా గవర్నర్ ఆంగ్లో-ఇండియన్ ఎమ్మెల్యేను నియమించొద్దని స్పష్టం చేసింది. అలాగే కీలకమైన విధానపర నిర్ణయాలేమీ తీసుకొవద్దని ఆదేశించింది. సాధారణ మెజార్టీ లేని యడ్యూరప్పను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానిస్తూ తీసుకున్న నిర్ణయం చట్టబద్ధమా కాదా అన్న అంశంపై విచారణ కొనసాగిస్తామని స్పష్టం చేసింది. కేసు విచారణను పది వారాలకు వాయిదా వేసిన సర్వోన్నత న్యాయస్థానం... కౌంటర్ అఫిడవిట్కు ఆరువారాలు, రిజాయిండర్లకు నాలుగు వారాల గడువు ఇచ్చింది.
నవతెలంగాణ-న్యూఢిల్లీబ్యూరో
భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి సుప్రీంకోర్టులో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. మెజార్టీ నిరూపణకు బీజేపీ సీఎం యడ్యూరప్పకు గవర్నర్ ఇచ్చిన 15 రోజుల కాలవ్యవధిని సర్వోన్నత న్యాయస్థానం కుదించింది. నేడు సాయంత్రం 4 గంటలకు బలపరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. ఇరుపక్షాలు మెజార్టీ తమకే ఉందని ప్రకటిస్తున్న నేపథ్యంలో 'అసెంబ్లీలో బలపరీక్షతో నిరూపించుకోండి' అని ఆదేశించింది. ప్రొటెం స్పీకర్ ఈ వ్యవహారం పూర్తిచేయాలని ఆదేశించిన న్యాయస్థానం... అప్పటివరకు కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం లేదా గవర్నర్ ఆంగ్లో-ఇండియన్ ఎమ్మెల్యేను నియమించొద్దని స్పష్టం చేసింది. అలాగే కీలకమైన విధానపర నిర్ణయాలేమీ తీసుకొవద్దని ఆదేశించింది. సాధారణ మెజార్టీ లేని యడ్యూరప్పను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానిస్తూ తీసుకున్న నిర్ణయం చట్టబద్ధమా కాదా అన్న అంశంపై విచారణ కొనసాగిస్తామని స్పష్టం చేసింది. కేసు విచారణను పది వారాలకు వాయిదా వేసిన సర్వోన్నత న్యాయస్థానం... కౌంటర్ అఫిడవిట్కు ఆరువారాలు, రిజాయిండర్లకు నాలుగు వారాల గడువు ఇచ్చింది.
యడ్యూరప్పను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తూ గవర్నర్ వాజుభాయి వాలా తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్, జేడీఎస్ దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ అశోక్భూషన్లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారించింది. ధర్మాసనం గత ఆదేశాలకనుగుణంగా ఈ నెల 15, 16వ తేదీల్లో గవర్నర్కు యడ్యూరప్ప సమర్పించిన లేఖలను అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ధర్మాసనానికి అందజేశారు. 'బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అలాగే నాకు ''ఇతరుల'' మద్దతు ఉంది. కాబట్టి ప్రభుత్వ ఏర్పాటుకు నన్ను ఆహ్వానించండి' అని యడ్యూరప్ప గవర్నర్కు అందించిన లేఖలో పేర్కొన్నారు. ఆ లేఖ సారాంశాన్ని బీజేపీ తరపు హాజరైన మాజీ అటార్నీ జనరల్ ముకుల్రోహత్గీ చదివి వినిపించారు. 'మెజార్టీ నిరూపించాల్సింది కోర్టురూములో కాదు' అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ ఏకే సిక్రీ జోక్యం చేసుకుంటూ..'మీరు చెబుతున్నట్టు మీది ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించొచ్చు. కానీ ఆ అంశాన్ని ధ్రువీకరించాలి. ఇక్కడ కాంగ్రెస్ కూడా లేఖ సమర్పించింది. ఒకరేమో కేవలం 'చెప్పుకుంటున్నారు' మరొకరు 'నిరూపిస్తున్నారు'. అలాంటప్పుడు గవర్నర్ ఎలా నిర్ణయిస్తారు?' అని సందేహం వ్యక్తం చేశారు. అయితే స్థిరప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ తన విచక్షణ ఆధారంగా నిర్ణయం తీసుకోవచ్చని రోహత్గీ చెప్పుకొచ్చారు. క్షేత్రస్థాయి వాస్తవాలను పరిశీలించడం గవర్నర్ బాధ్యత అని అన్నారు. కాంగ్రెస్లో లేఖలో ఎమ్మెల్యేల పేర్లు మాత్రమే ఉన్నాయని, అందులో సంతకాలు లేవని వాదించారు. ఇరుపక్షాలు తగువులాడుతుంటే ఆర్టికల్ 164 ప్రకారం గవర్నర్ తన విచక్షణ ఆధారంగా నిర్ణయం తీసుకోవచ్చు. 'అంతిమపోరాటం జరగాల్సింది సభలో' అని రోహత్గీ తెలిపారు. 'అది వాస్తవమే. కానీ మొదట ఎవరికి అవకాశం ఇస్తారన్నది ఇక్కడ ప్రశ్న' అని ధర్మాసనం సందేహం వ్యక్తం చేసింది. సర్కారీయా కమిషన్ నివేదిక ప్రకారం ఒక పార్టీకి పూర్తిస్థాయి మెజార్టీ ఉంటే వివాదం తలెత్తబోదని, ఏ పార్టీకీ మెజార్టీ లేనప్పుడు వివాదం ఏర్పడుతుందని ధర్మాసనం తెలిపింది. ఇదే సమయంలో ఎన్నికల ముందు కూటమికి, ఫలితాల అనంతరం ఏర్పడే కూటమికి వ్యత్యాసం ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. అయితే రెండు పార్టీలు మెజార్టీ ఉన్నాయని ప్రకటిస్తున్న నేపథ్యంలో నేరుగా సభలో నిరూపించకోవడం ఉత్తమం అని కోర్టు తెలిపింది. ఈ సందర్భంగా ధర్మాసనం రెండు ప్రతిపాదనలు చేసింది. శనివారం బలపరీక్షకు ఆదేశించడమా లేక గవర్నర్ చర్యలపై ఇరుపక్షాల వాదనలు విని నిర్ణయించడమా అని ప్రశ్నించింది. అయితే కాంగ్రెస్ తరపు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి ఈ సమయంలో జోక్యం చేసుకుంటూ.. గవర్నర్ 15 రోజుల గడువు ఇవ్వడంలో ఆయన ఉద్దేశమేంటని ప్రశ్నించారు. దీనిపై ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. మొదట బలపరీక్ష జరగాలని సూచించింది. గవర్నర్ చర్యలపై విచారణ కొనసాగిస్తామని స్పష్టం చేసింది. 'ఒకేసారి రెండు అంశాలపై విచారణ జరిపి నిర్ణయం వెలువరించేలోగా.. ఒకవేళ కాంగ్రెస్కు తీర్పు అనుకూలంగా వచ్చినా.. కీలకమైన సమయం వృథా అవుతుంది' అని ధర్మాసనం తెలిపింది. అయితే వెంటనే బలపరీక్ష నిర్వహణకు ఆదేశించాలని సింఘ్వీ కోరారు. దీంతో శనివారం మధ్యాహ్నమే బలపరీక్ష నిర్వహించాలని ధర్మాసనం తెలిపింది. అయితే రోహత్గీ జోక్యం చేసుకుంటూ.. దీన్ని సోమవారం నిర్వహించాలని కోరారు. అందుకు ధర్మాసనం నిరాకరించింది. ఇక ఆంగ్లో-ఇండియన్ ఎమ్మెల్యే నియామకాన్ని సవాల్ చేస్తూ సీనియర్ న్యాయవాది చిదంబరం వాదనలు వినిపించారు. బలపరీక్ష జరిగే వరకు ఎవరినీ నియమించొద్దని కోరారు. అందుకు ధర్మాసనం సమ్మతించింది. చివరకు శనివారం నాలుగు గంటలకు బలపరీక్ష చేపట్టాలని ధర్మాసనం ఆదేశించింది. బలపరీక్ష నిర్వహణకు అవసరమైన భద్రతను కల్పించాలని రాష్ట్ర డీజీపీకి కోర్టు ఆదేశించింది.