Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాట్నా: ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని నీరుగార్చేలా సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని ఏప్రిల్ 2న దళితులు చేపట్టిన భారత్ బంద్ ఆందోళనలో కీలక ప్రమేయమున్నదని భీం ఆర్మీ చీఫ్ ఉపకార్ బవ్రాపై జాతీయ భద్రత యాక్ట్(ఎన్ఎస్ఏ) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ముజఫర్నగర్లోని మూడు పోలీసు స్టేషన్లలో ఉపకార్పై కేసులున్నాయని జిల్లా మెజిస్ట్రేట్ రాజీవ్ శర్మ తెలిపారు. ముజఫర్నగర్లోని ఓ కోర్టులో ఏప్రిల్ 13న భీం ఆర్మీ చీఫ్ ఉపకార్ లొంగిపోగా..ఆయన్ని జ్యుడీషియల్ కస్టడీలోకి తీసుకున్నారు. కాగా, తాజాగా జైలులో ఉన్న ఉపకార్ బవ్రాపై జాతీయ భద్రత యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ముజఫర్నగర్లో పోలీసులు 40 కేసులు నమోదు చేసి సుమారు 90 మందిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.