Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిఫారసు చేయనున్న మిగతా పేర్లపై కొలీజియం మల్లగుల్లాలు..
- జస్టిస్ చలమేశ్వర్ రిటైర్మెంట్ తర్వాతే నిర్ణయమా..?
న్యూఢిల్లీ:సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉత్తరాఖండ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ కెఎం జోసెఫ్ పేరును మరోసారి ప్రతిపాదించే అంశం మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. జస్టిస్ కెఎం జోసెఫ్ పేరును పునరు ద్ఘాటించేందుకు అంగీకరించినప్పటికీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా సిఫారసు చేయనున్న మిగతా పేర్లపై చీఫ్ జస్టిస్ దీపక్మిశ్రా నేతృత్వంలోని కొలీజియంలో ఏకాభిప్రాయం కుదరకపోవడమే అందుకు కారణంగా తెలుస్తోంది. సుప్రీంకోర్టులో ప్రాతినిధ్యంలేని వివిధ హైకోర్టు లకు చెందిన ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తుల పదోన్నతిపై ఇంకా విస్తృత సంప్రదింపులు అవసరమని సుప్రీంకోర్టు కొలీజియం ఈ నెల 16న జరిగిన సమావేశంలో అభిప్రాయపడింది. జస్టిస్ కెఎం జోసెఫ్నకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి కల్పించాలని గతంలో చేసిన సిఫారసును పునరుద్ఘాటించాలని ఈ నెల 11న జరిగిన సమావేశంలో కొలీజియం ఏకాభిప్రాయానికొచ్చింది. అయితే,వివిధ హైకోర్టుల నుంచి సుప్రీంకోర్టుకు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాల్సిన పేర్లపైనా చర్చించాలని, ఆ పేర్లతోపాటు జస్టిస్ కెఎం జోసెఫ్ పేరును మరోసారి ప్రతిపాదించాలని ఆనాటి సమావేశంలో నిర్ణయించారు.