Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిమెంట్ లారీ బోల్తా 19 మంది మృతి, ఏడుగురికి తీవ్ర గాయాలు
గాంధీనగర్: గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సిమెంట్ లోడ్తో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 19 మంది మృతి చెందగా మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం... శనివారం ఉదయం గుజరాత్లోని భావ్నగర్ ఆహ్మదాబాద్ హైవేపై సిమెంట్ బస్తాలు, కూలీలతో వెళ్తున్న లారీ... బవల్యాలీ గ్రామ సమీపంలో మలుపు తిరుగుతుండగా అదుపుతప్పి హైవేపై నుంచి పడిపోయింది. సిమెంట్ బస్తాలు కూలీలపై పడటంతో 19 మంది అక్కడికక్కడే మృతి చెందారు. వారిలో ముగ్గురు చిన్నారులు, ఆరుగురు మహిళలు ఉన్నారు. కాగా మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.