Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి
న్యూఢిల్లీ: కర్నాటక గవర్నర్ వాజూభాయి వాలా రాజీనామా చేయాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేసింది. విశ్వాస పరీక్షకు ముందే బిఎస్ యడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో గవర్నర్ తీసుకున్న నిర్ణయం తప్పని రుజువైందని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ట్వీట్ చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని ఆహ్వానించడం ద్వారా గవర్నర్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని ఏచూరి విమర్శించారు. కర్నాటక గవర్నర్కు ఏమాత్రం విలువలు ఉన్నా వెంటనే రాజీనామా చేయాలని ఏచూరి హితవు పలికారు. బెంగళూరులో కూర్చొని అవినీతి ఒప్పందాలను ప్రోత్సహించిన కేంద్ర మంత్రులూ సమానంగా దోషులేనని ఏచూరి స్పష్టం చేశారు.
యడ్యూరప్ప రాజీనామా సమర్పించిన వెంటనే ఏచూరి పోస్ట్ చేసిన మొదటి ట్వీట్లో అవినీతి, నేరపూరిత బీజేపీ నమూనా ఓడిపోయిందన్నారు. ప్రజాస్వామిక సంస్థల్ని దుర్వినియోగం చేశారని, రాజ్యాంగ విలువల్ని ఉల్లంఘించారని ప్రధాని మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్షాను ఉద్దేశించి ఏచూరి వ్యాఖ్యానించారు. నల్లధనం, నేరస్తుల ద్వారా ప్రజాతీర్పును ధ్వంసం చేయాలని చూశారని ఏచూరి మండిపడ్డారుaఓ